జగన్ నోట కరోనా-పారసిటామల్ మాట.. TDP ట్రోలింగ్

YS Jagan Paracetamol corona virus
Spread the love

ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీలో కరోనాపై చెప్పిన మాట ఇపుడు తెలుగు రాష్ట్రాల్లో.. తెలుగు కమ్యూనిటీలోనే కాదు..దేశమంతటా హాట్ టాపిక్ అయ్యింది.  సాధారణ జ్వరం వచ్చినపుడు వేసుకునే పారసిటామల్ గోలీ వేసుకుంటే కరోనా నుంచి జాగ్రత్త పడొచ్చని సీఎం కేసీఆర్ అసెంబ్లీలో చెప్పారు. అంత చిన్న దానికి.. ఈ స్థాయిలో భయపడటం ఎందుకు అంటూ విమర్శలు వస్తున్నాయి. కేసీఆర్ కామెంట్స్ పై మీమ్స్ క్రియేటవుతున్నాయి.

ఇపుడు ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా అదే మాట చెప్పారు. కరోనా కట్టడి కోసం అన్ని చర్యలు తీసుకుంటామని చెప్పిన జగన్.. పారసిటామల్ టాబ్లెట్ సరిపోతుందని అన్నారు. పిల్లల ఎగ్జామ్స్ జరుగుతాయని.. విద్యార్థుల మధ్య 2 మీటర్ల దూరం ఉంచుతామని చెప్పారు. జగన్ చెప్పిన మాటలను .. టీడీపీ నేతలు ట్రోల్ చేస్తున్నారు. టీడీపీ జాతీయ కార్యదర్శి లోకేశ్ జగన్ వీడియోను ట్వీట్ చేశారు. కరోనా కంటే తాను ప్రమాదకరం అని గన్నేరుపప్పు మరోసారి నిరూపించుకున్నారని సెటైర్ వేశారు లోకేశ్.

 

(Visited 129 times, 1 visits today)
Author: kekanews