సంధ్య థియేటర్ ఘటనలో ఎవరి తప్పూలేదన్నారు హీరో అల్లు అర్జున్. ఇది అనుకోకుండా జరిగిన సంఘటన అని చెప్పారు. శ్రీతేజ్ కోలుకోవాలని కోరుకుంటున్నానని అల్లు అర్జున్ వెల్లడించారు. ఈ వ్యవహరంలో తానూ ఎవరినీ తప్పుపట్టడం లేదుని స్పష్టం చేశారు. అసెంబ్లీలో ఇవ్వాళ సీఎం వ్యాఖ్యల నేపథ్యంలో అల్లు అర్జున్ విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు.
ఈ సందర్బంగా అల్లు అర్జున్ మాట్లాడుతూ.. నాపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు-.15 రోజులుగా ఇంట్లోనే కూర్చొని బాధపడుతున్నా. ప్రభుత్వంతో నేను ఎలాంటి వివాదం కోరుకోవడం లేదు నా వ్యక్తిత్వాన్ని హననం చేయాలని చూస్తున్నారు. సీఎం రేవంత్ వ్యాఖ్యలు బాధ కలిగించాయి. సంధ్య థియేటర్ కు అనుమతి లేకుండా వెళ్లామనేది తప్పుదు ఆరోపణ.. రోడ్ షో చేశామని చెప్పడం సరికాదు-.అనుమతి లేకుంటే నేను అక్కడికి వెళ్లేవాడిని కాదు. వేల మంది నన్ను చూడటానికి వచ్చారు. వారికి ధన్యవాదాలు చెప్పడానికి బయటికి వచ్చా. తొక్కిసలాట గురించి మరుసటి రోజు తెలిసింది. తెలిసి కూడా నేను సినిమా చూస్తున్నానని అనడం సరికాదు . క్రౌడ్ ఎక్కువగా ఉందని చెప్పగానే వెళ్లిపోయానని అల్లు అర్జున్ తెలిపారు.
ఘటన జరిగిన వెంటనే ఆస్పత్రికి వెళ్దామనుకున్నా కానీ పోలీసులు నన్ను వెళ్లొద్దని చెప్పారు-. గతంలో చిరంజీవి, పవన్ అభిమానులను పరామర్శించడానికి..నేను ఎంతో దూరం వెళ్లా అలాంటిది నా అభిమానులకు ఇబ్బంది కలిగితే వెళ్లనా.. సినిమా హిట్ అయ్యాక విజయోత్సవం జరుపుదామనుకున్నాం కానీ ఈ ఘటన తర్వాత రద్దు చేసుకున్నాం- . వ్యక్తిత్వ హననాన్ని భరించలేకపోతున్నా అని -అల్లు అర్జున్ చెప్పుకొచ్చారు.