రాష్ట్ర హోంమంత్రి అలీకి కరోనా పాజిటివ్.. హాస్పిటల్ లో చేరిక

Spread the love

తెలంగాణ రాష్ట్రంలో కరోనా విజృంభిస్తోంది. సామాన్యులు.. నేతలు.. పోలీసులు.. జర్నలిస్టులు.. అందరికీ విస్తరిస్తోంది. తాజాగా.. రాష్ట్ర హోంశాఖ మంత్రి మహ్మద్ మెహమూద్ అలీకి కరోనా వైరస్ సోకింది. దీంతో.. ఆయన హైదరాబాద్ లోని అపోలో హాస్పిటల్ లో చేరారు.

కొద్దిరోజులుగా రాష్ట్రంలో రాజకీయ నాయకులను కరోనా వైరస్ టెన్షన్ పెడుతోంది. హోంమంత్రి అలీ సిబ్బంది, గన్ మెన్ లో కొందరికి ఇటీవలే పాజిటివ్ అని తేలింది. దీంతో.. మంత్రి అలీకి వైద్య అధికారులు టెస్టులు చేశారు. దీంతో.. కొద్దిరోజులుగా క్వారంటైన్ లో ఉన్న ఆయన.. అపోలో హాస్పిటల్ లో చేరారు.

టీఆర్ఎస్ కు చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు ఇప్పటికే హైదరాబాద్ లోని పలు హాస్పిటళ్లలో చికిత్స పొందుతున్నారు. ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి, బాజిరెడ్డి గోవర్దన్ , గణేశ్ గుప్తా వీరిలో ఉన్నారు. ఇపుడు ఈ లిస్టులో… మహ్మద్ మెహమూద్ అలీ కూడా చేరిపోయారు.

(Visited 115 times, 1 visits today)
Author: kekanews