యాంకర్ అనసూయ ఇటీవల ఓ సందర్భంలో చేసిన హెచ్చరికలు వైరల్ అవుతున్నాయి. సోషల్ ప్లాట్ ఫామ్ లో ఆమె వీడియోకు రెస్పాన్స్ ఎక్కువగా కనిపిస్తోంది. దిశ సంఘటనపై కొందరు బాధ్యత లేకుండా చేసిన కామెంట్స్ ను తప్పుపడుతూ మాట్లాడిన అనసూయ.. పలు అంశాలపై ఘాటుగా స్పందించింది.
సోషల్ ఇష్యూస్ పై తాను మాట్లాడితే ట్రోల్ చేస్తున్నారనీ.. అందుకే తాను ఎక్కువగా స్పందించడమే మానేశానని చెప్పింది. ఇదే సందర్భంలో ఆమె పలు సీరియస్ కామెంట్స్ చేసింది.
లేటెస్ట్ గా ఆమె ఓ టీవీ షోలో వేసుకున్న కాస్ట్యూమ్స్ , బయటకు విడుదలైన ఫొటోషూట్ స్టిల్స్ పైనా సోషల్ మీడియాలో ట్రోలింగ్ నడుస్తోంది. దీనికి కూడా ఆమె తన వీడియోలో సమాధానం చెప్పింది.
“కొందరికి ఎంటర్ టైన్ మెంట్ ను, రియల్ లైఫ్ ను డిఫరెన్షియేట్ చేయడమే తెలియడం లేదు. ఓ పక్క ఆడవాళ్లపై ఘోరాలు జరుగుతుంటే.. నేను టీవీ షోల్లో అంగాంగ ప్రదర్శన చేస్తున్నాననీ.. అంటున్నారు. సొసైటీకి ఏం జరిగినా.. నా లైఫ్ నాదే. నేను నా కుటుంబాన్ని ప్రొటెక్ట్ చేసుకోవాలి. నా పని నాదే. మీ పని మీరు చేయండి. సొసైటీకోసం ఏదైనా పనిచేసి బతకండి. నేను ఏది మాట్లాడినా రాద్ధాంతం చేస్తారు. అబ్బాయిలను పేరెంట్స్ సరిగా పెంచండి.
అమ్మాయిలకు దుపట్టాలేసుకుని కవర్ చేసుకోండని చెప్పకండి. మాకెలా ఉండాలో తెలుసు. ఏం వేసుకోవాలో మాకు బాగా తెలుసు. మీకేదైతే చూట్టానికి నచ్చలేదో.. మిమ్మల్ని రెచ్చగొట్టేలా ఉందో.. మీరే చూపు తిప్పుకోవడం నేర్చుకోండి. మీ పరిమితులు మీరు తెల్సుకోండి.. మాకు మా లిమిట్స్ తెలుసు.
సోషల్ మీడియాలో అమ్మాయిలను కించపరుస్తూ కామెంట్లు పెట్టేవాళ్లే అసలైన క్రిమినల్స్.. వాళ్లే ఫ్యూచర్ రేపిస్టులు.. వాళ్లను సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేయాలి. ” అని అనసూయ హెచ్చరించింది.
ఇది కూడా చదవండి : అక్షరాల సిరివెన్నెల.. తాతలోని మనవడిని అక్షరాల్లో చూపించాడు..!
https://youtu.be/dlTKamgDcIo