లాక్ డౌన్ టైమ్ లో.. మద్యం తాగేవాళ్లకు మంచిరోజులొచ్చాయి. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన రోజు రానే వచ్చింది. చాలా రాష్ట్రాల్లో వైన్ షాప్ లు ఓపెనయ్యాయి. ఐతే.. పెద్ద సంఖ్యలో షాప్ లకు వస్తున్న జనాన్ని కంట్రోల్ చేయడం పోలీసులకు, రెవెన్యూ సిబ్బందికి హెడేక్ గా మారింది.
పలుచోట్ల పోలీసులు లాఠీలకు పనిచెబుతున్నా పరిస్థితిలో మార్పు రావడం లేదు. చాలా రాష్ట్రాల్లోని పట్టణాల్లో మద్యం షాప్ లు ఇలా ఓపెన్ చేసి..జనం చేసే రచ్చ కారణంగా అలా బంద్ చేస్తున్నారు.
చత్తీస్ గఢ్ సర్కారు ఓ అడుగు ముందుకేసింది. మద్యం డోర్ డెలివరీ ఫెసిలిటీ తీసుకొచ్చింది. ఇందుకోసం ఓ ఆన్ లైన్ పోర్టల్ ను తీసుకొచ్చింది. ఏ బ్రాండ్ మద్యం కావాలి.. ఎంత కావాలి అనేది సెలెక్ట్ చేసుకుని.. ఆన్ లైన్ పేమెంట్ చేస్తే సరిపోతుంది. కోరుకున్న మందు ఇంటికే వస్తుంది. దీనికి 5లీటర్ల లిమిట్ కూడా పెట్టింది. డెలివరీ చార్జీగా 120 రూపాయలు వసూలు చేయాలని నిర్ణయించారు. మద్యంతో వచ్చే ఆదాయం భారీగా ఉంటుంది కాబట్టే.. ఎసెన్షియల్ సరుకులు, నిత్యావసరులు వస్తువులలాగే.. మద్యం షాప్ ల నుంచి మందును ఇంటికే డోర్ డెలివరీ చేయించుకునే ఫెసిలిటీ తీసుకొచ్చింది చత్తీస్ గఢ్ సర్కార్.