ఇండియాకు, పాకిస్థాన్ కు అసలు పోలికే లేదు. రెండుదేశాలు డెబ్బై ఏళ్లకిందట కలిసి ఉండేవే కానీ.. ఏనాడూ ఏ విషయంలోనూ పాకిస్థాన్.. ఇండియాతో పోటీ పడలేదు. ఏటికేడు ఉగ్రవాదంతో ఇండియాను దెబ్బతీసేందుకు ప్రయత్నించే పాకిస్థాన్ ..ఇకనుంచైనా బుద్ధి మార్చుకుంటే మంచిది.
ఇటీవలే కశ్మీర్ లో పోలీసుల పాసింగ్ ఔట్ పరేడ్ జరిగింది. ఆ పాసింగ్ ఔట్ పరేడ్ లో ఓ పోలీసు గన్ తీసుకుని ఓ చిన్నపిల్లాడు ఫొటోలకు పోజు ఇచ్చాడు. శిక్షణ ముగించుకున్న సందర్భంలో చిన్నారి బాబు పోలీసు తుపాకీతో ఫొటోలు దిగాడు. గన్ పట్టుకున్న కశ్మీరీ చిన్నపిల్లాడి ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అయింది.
మరో ఫొటో పాకిస్థాన్ కు సంబంధించింది. ఫొటోలో ఓ చిన్న పిల్లవాడు.. పెద్ద గన్ పట్టుకుని.. మెడ నిండా బుల్లెట్ల మాల వేసుకుని ఉన్నాడు. చదువు , బాధ్యత లేకుండా చిన్నప్పుడే టెర్రరిస్ట్ భావజాలం నింపుతారనే దానికి ఉదాహరణగా ఈఫోటో ఉంది.
ఈ రెండు ఫొటోలను కలిపి పాక్ లోని ప్రజాస్వామ్యాన్ని, జనం పోకడలను విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. ఇండియా అంటేనే దేశ సేవ, బాధ్యత అనీ.. పాకిస్థాన్ అంటేనే పక్కోడిమీద పగ తీర్చుకోవడం, దారితప్పడం అనీ అంటున్నారు.