సరిలేరు నీకెవ్వరు మూవీకి ఆడియో పరంగా నెగెటివ్ ఇంపాక్ట్ ఎక్కువైపోయింది. ప్రతి పాట రిలీజయ్యాక.. ట్రోలింగ్స్ తో బ్లాస్టింగ్స్ అయిపోతోంది. ఇప్పటివరకు ఒక్కటంటే ఒక్కపాట కూడా క్లిక్ కాలేదు. కొత్తగా రిలీజైన పాటను ఊహల్లో తేలిపోతూ హీరోయిన్ పాడుకునే పాడుకుంటుంది. . ఒకప్పటి గ్రీకువీరుడు.. నా రాకుమారుడులా ఈ పాట కూడా ఫుల్ క్రేజ్, ఆల్ టైమ్ హిట్ సాంగ్ అవుతుందేమో అనుకున్నారంతా.
కానీ.. జరిగిందివేరు. దేవిశ్రీ ప్రసాద్ మరోసారి తన పాటను మళ్లీ కాపీ చేసి.. కొత్త పాట పేరుతో ఇచ్చేశాడు. ఇటీవలకాలంలో.. దేవిశ్రీపాటల్లో ఆయన పాత పాటలే వినిపించడం షరామామూలుగా మారిపోయింది. ఆ ఆనవాయితీని మరోసారి కంటిన్యూ చేసేశాడు DSP. ఈ సాయంత్రం He’s So Cut.. So Handsome .. పాట రిలీజ్ చేశారు. ఐతే ఫేమస్ , బ్లాక్ బస్టర్ , కమర్షియల్ హిట్ అయిన రంగస్థలంలో రంగమ్మా.. మంగమ్మా పాటను.. అటూ ఇటూ మార్చేసి.. కొట్టిపారేశాడు దేవిశ్రీ ప్రసాద్.
మహేశ్ బాబు లాంటి స్టార్ హీరో… అనిల్ రావిపూడి లాంటి డైరెక్టర్ ను పెట్టుకుని… మంచి ట్యూన్లు ఇవ్వొచ్చుగా డీఎస్పీ అని సూపర్ స్టార్ అభిమానులు అనుకుంటున్నారు. కనీసం. రీరికార్డింగ్ ఐనా ఇరగదీయాలని కోరుకుంటున్నారు.
సంక్రాంతి కానుకగా విడుదల కానుంది సరిలేరు నీకెవ్వరు. మహేశ్ బాబుతో రష్మిక్ మందన్న జోడీ కట్టింది. యాక్షన్ ఎంటర్ టైనర్ గా ఈ మూవీకి రూపొందిస్తున్నారు.
Read Also : ఇదేం స్టైలురో రాములా.. బాటిల్ ఫైట్.. కొడవలే లైటర్
Read Also : ఆంటీ కాదు ఇంకా అమ్మాయే..! సన్నబడిన సన్నీలియోన్