Radhe Shyam : ‘రాధే శ్యామ్’ ట్రైలర్‌లో ఈ పాయింట్స్ గమనించారా..?

Spread the love

Radhe Shyam : ప్రభాస్ హీరోగా పూజా హెగ్డే హీరోయిన్ గా తెరకెక్కిన రాధే శ్యామ్ ట్రైలర్ రిలీజైంది. అద్భుతమైన, షాకింగ్ ట్విస్టులు, టర్నులున్న ప్రేమ కథ ఇది అని దర్శక నిర్మాతలు ఇన్నిరోజులు చెప్పుకుంటూ వచ్చారు. ట్రైలర్ చూసినా అదే ఫీలింగ్ కలుగుతుంది.

మొత్తం. 3 : 02 సెకండ్స్ ఉండే రాధే శ్యామ్ ట్రైలర్  ను రిలీజ్ చేశారు. ట్రైలర్ లో కీలకమైన అంశాలు గమనిస్తే సినిమా మీద ఆసక్తి క్రమంగా మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయి.

మనిషి పుట్టుక నుంచి చావు వరకు ప్రతి అడుగూ తనకు తెలుస్తుందని ప్రభాస్ చెబుతాడు. అమ్మాయిలతో ప్రేమ కాకుండా చిలక్కొట్టుడుకే అలవాటు పడిన ప్రభాస్.. ఓ అమ్మాయి ప్రేమ కోసం ఎంతగా పరితపించాడన్నది ఆసక్తికరం.

హీరోయిన్ కథాపరంగా చనిపోవాలని డెస్టినీ డిసైడ్ అవుతుందని.. ఐతే.. వారిద్దరూ కలవడం మాత్రం ప్రళయంతో సమానమని ట్రైలర్ లో చూపించారు. “నీ ప్రేమ ఎదురవడం వరం.. అందుకోవడం మాత్రం యుద్ధం” అని ప్రభాస్ చెప్పడం పెద్ద ఇంట్రస్టింగ్ పాయింట్ గా చెప్పుకోవచ్చు.

పలు దేశాల గొప్ప గొప్ప నేతలు పామిస్ట్ ప్రభాస్ తో హస్తవాసి చూపించుకుంటారు. అలా.. భారత ప్రధాని ఇందిరాగాంధీ కూడా ప్రభాస్ తో జాతకం చెప్పించుకుంటారు. ఎమర్జెన్సీ పెడతారని ప్రభాస్ ముందే ఊహిస్తాడు. అది ప్రపంచవ్యాప్తంగా సంచలనం రేపుతుంది. ఐతే.. హీరోయిన్ తో ప్రేమ గెలవడం అసాధ్యమని తెలుసుకున్న హీరో.. తన బాధను దిగమింగి.. దాన్ని గెలిపించుకోవడానికి సప్త సముద్రాలు దాటినంతగా కష్టపడతాడని.. ప్రపంచ దేశాలు చుట్టేస్తాడని తెలుస్తోంది. ఇది మరింత ఇంట్రస్ట్ పెంచే అంశం కానుంది.

షిప్ ప్రమాదాలు.. టీవీలో కనిపించిన రైలు పట్టాలు తప్పిన వీడియో.. కథలో ప్రధాన భావోద్వేగ సన్నివేశాలుగా చెప్పుకోవచ్చు.  జస్టిన్ ప్రభాకర్ ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా బాగుంది. ఈ మూవీకి దర్శకుడు రాధాకృష్ణకుమార్. 2022 జనవరి 14న రాధే శ్యామ్ రిలీజ్ కానుంది.

(Visited 67 times, 1 visits today)
Author: kekanews