నిందితుల అరెస్ట్.. ప్రియాంక చెప్పిన ఆ దెయ్యపు మొహాలు ఇవే..!

Priyanka Reddy Case Accused
Spread the love

ప్రియాంక రెడ్డి రేప్ – మర్డర్-దహనం కేసును ఛేదించిన పోలీసులు

పోలీసుల అదుపులో నలుగురు నిందితులు

మీడియా ముందుకు తీసుకొస్తారా.. ఎన్ కౌంటర్ లో లేపేస్తారా.. ?

సంచలనం సృష్టించిన వెటర్నరీ డాక్టర్ ప్రియాంక రెడ్డి హత్య కేసును పోలీసులు 24 గంటల్లో ఛేదించారు. సీసీ కెమెరాల సాయంతో.. ఈ కేసును ఛేదించినట్టు సమాచారం. మొత్తం నలుగురు ప్రధాన నిందితులు సైబరాబాద్ పోలీసుల అదుపులో ఉన్నట్టు సమాచారం అందుతోంది. అత్యాచారం తర్వాత తలపైరాయితో కొట్టి.. మెడకు చున్నీతో ఉరిబిగించి చంపేసి.. ప్రియాంకరెడ్డిన తగలపెట్టిన ప్రధాన నిందితుడు మహ్మద్ పాషా అని పోలీసులు చెబుతున్నారు. అతడు పోలీసుల అదుపులో ఉన్నాడు. అతడి ఫొటోను కూడా పోలీసులు విడుదల చేశారు.

మహ్మద్ పాషాతో పాటు.. లారీ క్లీనర్, ఇద్దరు యువకులు పోలీసుల అదుపులో ఉన్నట్టు సమాచారం. మహ్మద్ పాషాది మహబూబ్ నగర్  జిల్లా నారాయణపేటగా తేల్చారు. నిందితులు మహబూబ్ నగర్, రంగారెడ్డి జిల్లాకు చెందినవారని తెలుస్తోంది. నారాయణపేట జిల్లా జక్లేర్ గ్రామానికి చెందిన ప్రధాన నిందితుడు మహమ్మద్ పాషా.. మరో ముగ్గురు నిందితులు గుడిగండ్ల కు చెందిన చెన్నకేశవులు, జొల్లు శివ, జొల్లు నవీన్ కుమార్ గా గుర్తించారు.

Read Also :

అప్పుడు వరంగల్.. ఇపుడు షాద్ నగర్.. కొడుకుల్ని ఎన్ కౌంటర్ చేయాల్సిందే

ప్రియాంకరెడ్డి తన చెల్లెలితో ఫోన్లో మాట్లాడుతూ.. “దెయ్యపు మొహాలు ఇక్కడే ఉన్నారు.. వాళ్లు అక్కడే దారికి అడ్డంగా ఉన్నారు. నన్ను వెళ్లనీయడం లేదు. బైక్ తీసుకుపోయిన దెయ్యపు పిల్లోడు ఇంకా రాలేదు” అని పదే పదే చెప్పింది. మొత్తానికి ఆ దెయ్యపుమొహాలు పోలీసుల అదుపులో ఉన్నాయి. వారిని మీడియాకు చూపిస్తారా.. లేక ఎన్ కౌంటర్ లో లేపేస్తారా అన్నదే తేలాల్సి ఉంది.

 

(Visited 148 times, 1 visits today)
Author: kekanews

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *