ఒవైసీ బ్రదర్స్ కు కరోనా పాజిటివ్.. వార్తలో నిజమెంత..?

Asaduddin Akbaruddin Corona Positive
Spread the love

రాష్ట్రంలో ప్రజాప్రతినిధులు చాలామంది కరోనా బారిన పడుతున్నారు. ఒవైసీ బ్రదర్స్.. అసదుద్దీన్ , అక్బరుద్దీన్ లకు కూడా కరోనా పాజిటివ్ వచ్చినట్టు న్యూస్ చక్కర్లు కొడుతోంది. సోషల్ మీడియాలో.. ఈ ఇద్దరు అన్నదమ్ములకు కరోనా పాజిటివ్ వచ్చినట్టు ఓ వార్త షేర్ అవుతోంది. ఐతే.. ఇందులో అధికారిక సమాచారం లేదని.. అధికారికంగా ప్రకటించాల్సి ఉందని వైరల్ అయిన న్యూస్ లో ఉంది.

ఒవైసీ బ్రదర్స్ కు కరోనా వార్తలను ఆల ఇండియా మజ్లిస్ ఇత్తెహాదుల్ ముస్లిమీన్ – ఎంఐఎం పార్టీ ఖండించింది. తమకు కరోనా సోకిందన్న వార్తలను అసదుద్దీన్ ఒవైసీ చెత్త వాగుడు .. రబ్బిష్ అంటూ తప్పుపట్టారు. ఇదంతా వాట్సప్ యూనివర్సిటీలో తిరుగుతున్న తప్పుడు ప్రచారం అని కొట్టిపారేశారు.

ఇలాంటి రూమర్స్ ను స్ప్రెడ్ చేయొద్దని మీడియాను మజ్లిస్ పార్టీ పీఆర్వో కోరారు. ఐతే.. సోషల్ మీడియాలో పీఆర్ఓ అకౌంట్లలో ఎక్కడా ఈ ప్రకటన కనిపించలేదు. ఒవైసీ బ్రదర్స్ కు కరోనా వార్తలు కరెక్ట్ కాదని.. వాట్సప్ లో మాత్రం మజ్లిస్ పార్టీ నుంచి మెసేజ్ వచ్చింది.

హైదరాబాద్ లో కరోనా కేసులు పెరుగుతూ ఉండటంతో.. ఒవైసీ బ్రదర్స్ అలర్ట్ అయ్యారు. హైదరాబాద్ పరిధిలోని ఏడు సెగ్మెంట్లలో 20వేల టెస్టులు వేగంగా చేయాలని రాష్ట్ర మంత్రి ఈటల రాజేందర్ ను కోరుతూ అక్బరుద్దీన్ ఒవైసీ లెటర్ రాశారు. సికింద్రాబాద్ సెగ్మెంట్ లోని నాంపల్లిలోనూ 2వేల మందికి టెస్టులు చేయాలని మంత్రిని కోరారు అక్బర్.

 

(Visited 65 times, 1 visits today)
Author: kekanews

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *