కరోనా వైరస్ సోకిన సెలబ్రిటీల సంఖ్య పెరుగుతోంది. లేటెస్ట్ గా అలనాటి హీరోయిన్, వెటరన్ యాక్ట్రెస్, కర్ణాటక రాష్ట్రంలోని మాండ్య లోక్ సభ సభ్యురాలు సుమలతకు కరోనా సోకింది. గత రెండు రోజులుగా సుమలత కరోనా లక్షణాలైన జ్వరం, దగ్గు, సర్దితో బాధపడ్డారు. డాక్టర్లను సంప్రదించి టెస్టు చేయించుకుంటే పాజిటివ్ వచ్చింది. దీంతో.. డాక్టర్ల సలహా తీసుకుని.. హోమ్ క్వారంటైన్ అయ్యారు సుమలత.
మాండ్యాలో సుమలత ఇటీల పలు డెవలప్ మెంట్ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఆమె పర్యటనలో పాల్గొన్నవారిలో టెన్షన్ కనిపిస్తోంది. జనంలో నేతలతో కలిసి తిరగడం వల్లే.. సుమలతకు కరోనా సోకిందని అంటున్నారు. కర్ణాటకలో ఇటీవల కరోనా కేసులు భారీగా నమోదవుతున్నాయి. దీంతో.. ప్రతి ఆదివారం బెగంళూరు నగరాన్ని పూర్తిగా లాక్ డౌన్ చేస్తున్నట్టు అక్కడి ప్రభుత్వం ప్రకటించింది.
మరోవైపు.. తనకు అనారోగ్య సమస్యలు పెద్దగా లేవని.. ఎవరూ అధైర్య పడొద్దని.. కరోనా లక్షణాలు ఉన్నవారు క్వారంటైన్ అయి జాగ్రత్తలు పాటించాలని సన్నిహితుల ద్వారా మీడియాకు సమాచారం పంపించారు సుమలత.