ఉత్తర కొరియా సుప్రీమ్ లీడర్, నియంత #KimJongUn చనిపోయారని అందరూ అనుకున్నారు. అందుకే పబ్లిక్ లో కనిపించట్లేదని కొద్దిరోజులుగా మీడియాలో ఫుల్లు వార్తలొచ్చాయి. దీనిపై చాలా కథనాలు వండారు జర్నలిస్టులు. కిమ్ కథ అయిపోయిందనీ.. తర్వాత.. ఆయన సోదరి అన్నీ చూసుకునేందుకు సిద్ధమైపోయారని అన్నారు. కానీ.. అవన్నీ కట్టుకథలే అని తేలిపోయింది. 20 రోజుల తర్వాత కిమ్ కెమెరా ముందు నవ్వుతూ కనిపించారు.
నార్త్ కొరియా శత్రు దేశాలకు షాకింగ్ న్యూస్ తెలిసింది. కిమ్ జాంగ్ ఉన్ చనిపోలేదు. ఆయన బతికే ఉన్నారు. ప్యాంగ్ యాంగ్ లోని సన్ చిన్ ఎరువుల ఫ్యాక్టరీ ఓపెనింగ్ లో కిమ్ నవ్వుతూ పాల్గొన్నారు. ఆయనకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
#WATCH North Korea's Kim Jong Un makes first public appearance in 20 days, at the completion of a fertilisers plant in Pyongyang pic.twitter.com/1OY8W8ORD7
— ANI (@ANI) May 2, 2020