కేసీఆర్ సంచలన ఆడియో లీక్.. గల్ఫ్ కార్మికులు, కూలీలు ఫైర్!

Cm KCR Sensational Phone Call
Spread the love

సీఎం కేసీఆర్ ది గా చెబుతున్న ఓ ఫోన్ సంభాషణ ఆడియో రికార్డ్ తెలంగాణలో సంచలనం రేపుతోంది. జగిత్యాల జిల్లా కొడిమ్యాలకు చెందిన రైస్ మిల్ యజమాని గోపాల్ రావు తో సీఎం కేసీఆర్ ఫోన్ లో మాట్లాడారు.

రాబోయే రోజుల్లో సాగు ఎలా ఉండబోతోంది.. రా రైస్ దిగుమతికి సంంబంధించి మాట్లాడారు. ఐతే… ఇందులో కులం ప్రస్తావ రావడం.. గల్ఫ్ దేశాలకు, వలస వెళ్లినవారిని కేసీఆర్ తక్కువ చేసి మాట్లాడినట్టుగా ఉంది. ఉత్తరాది రాష్ట్రాల వాళ్లు ఇక్కడ హమాలి పనిచేసి 15వందలు సంపాదిస్తుంటే.. మనవాళ్లు కరువు పనులకు పోతారని రైస్ మిల్ యజమాని అన్నప్పుడు.. కేసీఆర్ వారిని ముం..కొడుకులు.. లాంటి పలు బూతు పదాలను వాడినట్టుగా ఫోన్ ఆడియో రికార్డులో ఉంది. షావుకార్లు, అధికారుల గురించి కూడా వివాదాస్పద కామెంట్స్ ఉన్నాయి. ఈ ఆడియో ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఇది కేసీఆర్ వాయిస్సే అని కొందరంటే.. డబ్బింగ్ స్టూడియోలో చెప్పించారు అని కొందరు ఆ వీడియోల కింద కామెంట్స్ లో చెబుతున్నారు.  ఐతే..  కేసీఆర్ వాయిస్సే అనేవాళ్లే 99శాతం మంది ఉన్నారు. వారంతా.. కేసీఆర్ నిజస్వరూపం బయటపడింది అంటున్నారు. వలస వెళ్లినవాళ్లంటే నీకు అంత చులకన ఎందుకంటూ కేసీఆర్ ను నిలదీస్తున్నారు. లాక్ డౌన్ టైమ్ లో కరువు పనే తమ పొట్ట నింపిందని కొందరంటున్నారు. పని కల్పిస్తే చేసుకోవడానికి పేదలు ఎందుకు ముందుకు రారు అని ప్రశ్నిస్తున్నారు. కేసీఆర్ కు త్వరలోనే బుద్దిచెప్పాలన్న కామెంట్స్ వందలాదిగా పెడుతున్నారు. ఆ వీడియో లింక్ కింద ఉంది. చూడండి.

(Visited 333 times, 1 visits today)
Author: kekanews

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *