రాజ్ నాథ్ ఫొటో చూశారా.. ఏం అనిపించట్లేదా..?

Rajnath Ladakh
Spread the love

చైనాతో సరిహద్దులో యుద్ధం కన్నా ముందు.. కరోనాతో యుద్ధం చేయడం చాలా ముఖ్యం. వైరస్ కు అతీతమైన వాళ్లు ఎవరూ లేరు. వస్తే క్వారంటైన్. లేకపోతే పోరాటం. చైనాతో సరిహద్దు లడఖ్ లోనూ అదే జరుగుతోంది.

జనాలుండే నగరాల్లోనేకాదు.. అసలు జనమే లేని…సరిహద్దులోనూ కరోనా జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. లడఖ్ లో సైన్యం సమాయత్తతను పరిశీలించేందుకు రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ సరిహద్దుకు వెళ్లారు. హెలికాప్టర్ దిగగానే… రాజ్ నాథ్.. తన చేతులను శానిటైజ్ చేసుకున్నారు. ఓ సైనికుడు శానిటైజర్ తీసుకురాగానే.. తన చేతులు శుభ్రపరుచుకున్నారు.

వైరస్ ఎక్కడినుంచి ఎక్కడికి వెళ్లేది తెలియదు. అందుకే రక్షణ మంత్రి కూడా ఈ జాగ్రత్తలు తీసుకున్నారు. అందరూ మాస్కులు పెట్టుకున్నారు. సైన్యమైనా.. సరిహద్దు శత్రువుతో పోరాడాలంటే..ముందు కరోనాను జయించాల్సిందే. చేతుల శానిటైజేషన్ కు అంత విలువుంది.

(Visited 105 times, 1 visits today)
Author: kekanews