శ్రీదేవి, రుక్మిణి(ప్రీతి), వణిత. ఈ ముగ్గురు అక్కాచెల్లెళ్లు. నటి మంజుల, విజయ్ కుమార్ కూతుళ్లు. ఇందులో.. శ్రీదేవి మాత్రమే గ్లామరస్ హీరోయిన్ గా సక్ససె అయింది. ఇప్పటికీ టీవీ తెరపై సందడి చేస్తోంది. ఈ ముగ్గురిలో పెద్దఅమ్మాయి అయిన వనిత.. లేటెస్ట్ గా.. 40 ఏళ్ల వయసులో పెళ్లి చేసుకోవడం ఆసక్తి కలిగిస్తోంది.
దేవి సినిమాలో ప్రధాన పాత్రలో భక్తురాలిగా నటించిన వనితా విజయకుమార్ గుర్తుందా. ఆమె.. 40 యేళ్ళ వయసులో మూడోసారి పెళ్లి చేసుకుంది. తన ఇద్దరు కూతుళ్లే గెస్టుగా అటెండవ్వడం విశేషం.
వనితా విజయకుమార్ తెలుగులో దేవిలో మాత్రమే కనిపించారు. తమిళంలో మంచి సక్సెస్ లు ఉన్నాయి. టీవీ సీరియల్స్ తో పాపులర్ అయ్యారు. వనితా మొదట ఆకాష్ అనే వ్యక్తిని 2000 ఏడాదిలో పెళ్లిచేసుకున్నారు. ఆకాష్, వనితలకు ఒక కుమార్తె ఉంది. కొన్ని విబేధాల కారణంగా వనితా …ఆకాష్ తో 2005లో విడాకులు తీసుకుంది.
తర్వాత 2007లో జయ రాజన్ అనే బిజినెస్ మ్యాన్ ను పెళ్లాడింది. వీళ్లద్దరికి కూడా ఓ కూతురుంది. ఐదేళ్ల తర్వాత… వీళ్లిద్దరూ విడిపోయారు. ఇప్పుడు మళ్ళీ వనిత… పీటర్ పాల్ అనే విజువల్ ఎఫెక్ట్స్ డైరెక్టర్ ను పెళ్లి చేసుకుంది. వనితా మళ్ళీ పెళ్లిచేసుకోవడం పై మూవీ ఇండస్ట్రీ, టీవీ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయింది.
జూన్ 27న క్రిస్టియన్ సంప్రదాయం గంటలకు చెన్నైలో వీరి పెళ్లివేడుక.. లాక్ డౌన్ నిబంధనలకు అనుగుణంగా సన్నిహితుల మధ్య జరిగింది. వీళ్లిద్దరి పెళ్లికి ఆమె ఇద్దరు కూతుళ్లే గెస్టులుగా ఉండటం పెద్ద విశేషం. వేడుకలో వనిత మాజీ భర్త పిల్లలు జోవికా, జయనిత ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. వీరి పెళ్లివేడుక ఫొటోలు వైరల్ అయ్యాయి.