అసలే ఇది సెన్సిటివ్ టైమ్. రేపిస్టులను నిర్దాక్షిణ్యంగా చంపేయాలని.. వారిని ఎన్ కౌంటర్ చేయాలని జనం డిమాండ్ చేస్తున్న టైమ్. అమాయకురాలైన వెటర్నరీ డాక్టర్ ప్రియాంకరెడ్డి ని సాయం చేస్తామని నమ్మించి.. రాత్రిపూట అత్యంతదారుణంగా రేప్ చేసి చంపేసిన నిందితులు పోలీసుల కస్టడీలో ఉన్న టైమ్. ఆ నలుగురిని చంపేయాలని అందరూ డిమాండ్ చేస్తున్న టైమ్ లో.. రెచ్చగొట్టే పోస్టులపై సోషల్ మీడియాలో నిఘా ఉంది.
Read Also : ఈ మంత్రులు, పోలీసులను చూస్తే అసహ్యం వేస్తోంది..!
రేప్ చేస్తే తప్పేంటి… అంటూ Nastika అనే వ్యక్తి ఫేక్ నేమ్ తో ఫేస్ బుక్ లో పోస్టు ఒకటి పెట్టాడు. అందులో అత్యంత దారుణమైన ఆరోపణలు చేశాడు. అమ్మాయిలను రేప్ చేయకపోతే పూజ చేస్తారా అంటూ చెత్త వాగుడు వాగాడు. ఫేస్ బుక్ లో సంతాపం ప్రకటిస్తారా.. కొవ్వొత్తులతో నివాళులు అర్పిస్తారా.. అంటూ చాలామందిని చులకన చేసి మాట్లాడాడు. దీంతో.. అతడి ఫేస్ బుక్ అకౌంట్ ను రిపోర్ట్ చేశారు చాలామంది. పోలీసులకుకూడా కంప్లయింట్ చేశారు. ఐడీ ఆధారంగా లొకేషన్ తెల్సుకున్న ఖమ్మం జిల్లా షీ టీమ్స్ పోలీసులు… దీనిపై వెంటనే రియాక్టయ్యారు. ఫేస్ బుక్ లో సెన్సిటివ్ ఇష్యూపై పిచ్చి వాగుడు వాగినందుకుగానూ…అతడిపై కేసు పెడుతున్నట్టు ఆ పోస్ట్ కిందే రిప్లై ఇచ్చారు.
ఐతే.. Nastika అకౌంట్ హోల్డర్ దీనిపై స్పందించాడు. సారీ.. ఇంకోసారి ఇలాంటివి పెట్టను అని కాళ్ల బేరానికొచ్చాడు. కానీ… షీ టీమ్స్ పోలీసులు వినలేదు. దీనిపై మేం ఏం చేయలేం. ఆల్రెడీ కేసు నమోదైంది అని చెప్పారు.
ఫోన్ ఉంది కదా అని టిక్క టిక్క ఒత్తుకుంట.. పిచ్చి వాగుడు వాగితే ఇలాగే ఉంటుంది. వాళ్ల అకౌంట్ బ్యాన్ అవుతుంది. పేజీలు యాక్సెస్ చేసుకోవడానికి వీలులేకుండా చేస్తారు. సోషల్ మీడియాలో రిస్ట్రిక్షన్స్ పెడతారు. సోషల్ మీడియా కదా మానిటరింగ్ ఉండదనుకుంటే పొరపాటే.
ఆ ఫేస్ బుక్ ఫొటో పోస్ట్ కింద చూడొచ్చు.