ఢిల్లీ-లండన్ బస్సు ప్రయాణం.. 18 దేశాలు.. 70 రోజుల జర్నీ

Spread the love

మీకు బస్సులో ప్రయాణించడమంటే ఇష్టమా..? బస్సులోనే ప్రపంచ దేశాలను చుట్టేయాలనుకుంటున్నారా? అయితే ఈ వార్త మీకోసమే.

ఢిల్లీ నుంచి లండన్‌కు బస్సులో వెళ్లొచ్చు. ప్రపంచంలోనే అత్యంత సుదూర బస్సు యాత్ర ఇది. 70 రోజుల్లో 20 వేల కిలోమీటర్ల ప్రయాణంతో.. మొత్తం 18 దేశాలను చుట్టేయొచ్చు. గురుగ్రామ్‌కు చెందిన‌ అడ్వెంచర్స్‌ ఓవర్‌ ల్యాండ్ సంస్థ చేపడుతున్న ఈ సాహస యాత్ర.. వచ్చే ఏడాది ప్రారంభం కానుంది. ఈ బస్సు ప్రయాణానికి సంబంధించిన ఆసక్తికర విశేషాలు మీకోసం..

సకల సదుపాయాలు ఉన్న లగ్జరీలో బస్సులో ఈ ప్రయాణం మొదలవుతుంది. భారత్‌లో మొదలై.. మయన్మార్, థాయ్‌లాండ్, లావోస్, చైనా, కజకిస్థాన్, ఉజ్బెకిస్థాన్, రష్యా, లిథువేనియా, లాత్వియా, పోలాండ్, చెక్ రిపబ్లిక్, జర్మనీ, నెదర్లాండ్స్, బెల్జియం, ఫ్రాన్ మీదుగా ఈ బస్సు ఇంగ్లాండ్ చేరుతుంది. నాలుగు దశల్లో ఈ బస్సు ఢిల్లీ నుంచి లండన్ చేరుకుంటుంది.

చైనాలోని సించువాన్, జిన్‌జియాంగ్ ప్రావిన్సులను ఈ ట్రిప్ ద్వారా కవర్ చేయొచ్చు. గ్రేట్ వాల్ ఆఫ్ చైనా, సిల్క్ రూట్, గోబీ ఎడారిని కూడా చూడొచ్చు. తర్వాత ఈ కార్ వాన్ కిర్గిస్థాన్, ఉజ్బెకిస్థాన్, రష్యా వెళ్తుంది.

ఈ ట్రిప్ కోసం బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. 20 మంది ప్రయాణికులకు మాత్రమే అనుమతి ఉంటుంది. అయితే బుక్ చేసుకుందాం అనుకుంటున్నారా..? తొందరపడకండి.. సకల సదుపాయాలు ఉన్న ఈ బస్ టికెట్ ధర అక్షర రూ.15 లక్షలు. డబ్బులు మొత్తం చెల్లించిన వారికి తొలి ప్రాధాన్యం ఇస్తారు. శాకాహం అందిస్తారు కానీ.. స్థానికంగా దొరికేవి, రెడీ టూ ఈటూ మాత్రమే అందుబాటులో ఉంటాయి. హోటల్ గదిని ఇద్దరు పంచుకోవాల్సి ఉంటుంది. వీసా ఖర్చులను సదరు ట్రావెల్ ఏజెన్సీనే భరిస్తుంది. ఇంగ్లిష్ మాట్లాడే గైడ్ కూడా ఉంటారు.

లండన్ నుంచి కోల్‌కతాకు 1957లోనే 20 మంది ప్రయాణికులతో తొలి బస్సు ప్రయాణించింది. ఈ బస్సు టికెట్ ధర 145 పౌండ్లు. మన కరెన్సీలో చెప్పాలంటే రూ.13,644.

(Visited 48 times, 1 visits today)
Author: kekanews