సమంత అక్కినేనికి సినిమాల్లో వాయిస్ ఓవర్ అందించే చిన్మయి.. తరచుగా వార్తల్లో ఉంటుంటుంది. తాజాగా.. తన అకౌంట్ హ్యాక్ అయిందంటూ పూజా హెగ్డే చేసన ఓ ఇన్ స్టగ్రామ్ పోస్టు టాలీవుడ్ లో రచ్చచేసింది. దీనిపై.. నందినీ రెడ్డి, సమంత, చిన్మయి.. ముగ్గురు సెటైర్లు వేశారు. సోషల్ మీడియాలో పూజా హెగ్డే కామెంట్స్ కు.. సమంత , నందినీ రెడ్డి, చిన్మయి వెటకారంగా రెస్పాండ్ కావడంతో… ఈ ముగ్గురి పోస్టులు వైరల్ అయ్యాయి.
పూజాహెగ్డే అసలే టాప్ హీరోయిన్. ఆమెను ఏమైనా అంటారా.. ఆమె ఫ్యాన్స్ ఊరుకుంటారా. నందినీ, సమంత, చిన్మయిలను ఫుల్లుగా రివర్స్ కౌంటర్ ఇచ్చారు. దీంతో.. చిన్మయి చిర్రెత్తుకొచ్చి.. కొన్ని మీమ్స్ అకౌంట్లపై సైబర్ క్రైమ్ స్టేషన్ గచ్చిబౌలిలో కంప్లయింట్ చేసింది.
Thugwala, Relangi mavayya, care of entertainmets పేజీల్లో తనపట్ల అసభ్యంగా మీమ్స్ తయారుచేస్తున్నారని చిన్మయి కంప్లయింట్ చేసింది. లంజముండా అనీ… పిల్లలు పుట్టలేదని… దీనికి రాడ్ దించాలి.. లాంటి తిట్లు ఉపయోగించి పోస్టులు పెట్టారనీ.. వారందరి డీటెయిల్స్ ను పోలీసులకు ఇచ్చింది చిన్మయి. ఈ వ్యవహారం ఎక్కడిదాకా వెళ్తుందో చూడాలి.