ఆదివారం హైదరాబాద్ కు బండి సంజయ్

Bandi Sanjay Amit Shah
Spread the love

తెలంగాణ రాష్ట్ర బీజేపీకి అధ్యక్షుడిగా ఎంపికైన కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ ఆదివారం నాడు హైదరాబాద్ రానున్నారు. బుధవారం మార్చి 11నాడు బండి సంజయ్ ను తెలంగాణ రాష్ట్ర బీజేపీ కొత్త  అధ్యక్షుడిగా బీజేపీ అధిష్ఠానం ఎన్నుకుంది. డాక్టర్ కె.లక్ష్మణ్ పదవీ కాలం ముగియడంతో… రాష్ట్ర బీజేపీ పగ్గాలను బండి సంజయ్ కు అప్పగించింది హైకమాండ్.

బండి సంజయ్ కు యూత్ లో ఇప్పటికే మంచి ఫాలోయింగ్ ఉంది. దీంతో.. బండి సంజయ్ కు ఘనంగా స్వాగతం పలికేందుకు బీజేపీ శ్రేణులు ప్రయత్నాలు ప్రారంభించాయి. శంషాబాద్ ఎయిర్ పోర్టునుంచే ర్యాలీగా బండి సంజయ్ ను పార్టీ ఆఫీసుకు తీసుకురావాలని నిర్ణయించాయి. ఆ తర్వాత.. హైదరాబాద్ పార్టీ ఆఫీస్ లో జరిగే కార్యక్రమంలో బండి సంజయ్ బాధ్యతలు తీసుకుంటారు. పార్టీ నేతలు, కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతారు. తమ ముందు లక్ష్యాలను వివరించి.. అందుకు తగ్గ ప్రణాళికలను ఆయన వివరించే అవకాశాలున్నాయి.

అమిత్ షాతో బండి సంజయ్ భేటీ

కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను బండి సంజయ్ కలిశారు. పార్టీ జాతీయ అధ్యక్షుడు జగత్ ప్రకాశ్ నడ్డా, కేంద్ర హోంశాఖ సహాయమంత్రి, సికింద్రాబాద్ ఎంపీ కిషన్ రెడ్డి కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. తెలంగాణలో బీజేపీకి మంచి భవిష్యత్తు ఉందని.. కష్టపడితే మంచి అవకాశాలు దక్కే చాన్స్ ఉందని బండి సంజయ్ కు అమిత్ షా సూచించారు.

(Visited 231 times, 1 visits today)
Author: kekanews