ఎల్లువొచ్చి గోదారమ్మా… బాలసుబ్రహ్మణ్యం గొంతు సూపర్

Spread the love

వాల్మీకి సినిమా కోసం దేవత సినిమాలోని ఆల్ టైమ్ సూపర్ హిట్ సాంగ్ ఎల్లువొచ్చి గోదారమ్మ సాంగ్ ను రీమిక్స్ చేయడం ఇపుడు టాలీవుడ్ లో హాట్ టాపిక్ అయింది. వరుణ్ తేజ్, పూజాహెగ్డేలపై ఈ సాంగ్ ను షూట్ చేశారు దర్శకుడు హరీష్ శంకర్. రాఘవేంద్రరావు- సంగీత దర్శకుడు చక్రవర్తి… దేవత సినిమా కోసం.. బాలసుబ్రహ్మణ్యం, సుశీలతో ఈ పాటను పాడించారు. రీమిక్స్ పాటను కూడా బాలసుబ్రహ్మణ్యంతోనే పాడించారు  హరీష్ శంకర్- మిక్కీ జే మేయర్. ఐతే.. ఫిమేల్ వాయిస్ ను గీతా మాధురితో పాడించినప్పటికీ… ఆ తర్వాత ఆమె వాయిస్ ను పక్కనపెట్టి.. లెజెండరీ సింగర్ సుశీల వాయిస్ ను అలాగే ఉంచేశారు.

ఈ ప్రయోగంపై సంగీత అభిమానులు వెల్లువలా ప్రశంసలు గుప్పిస్తున్నారు. సుశీల వాయిస్ ను మళ్లీ లేటెస్ట్ టెక్నాలజీతో థియేటర్ లో వినే అవకాశం దక్కిందని సంబరపడిపోతున్నారు. పాటలో బాలసుబ్రహ్మణ్యం గొంతుకు వందకు వంద మార్కులు పడుతున్నాయి. బాలు వాయిస్ లో బేస్ పెరిగిపోవడం.. డ్యూయెట్లకు సెట్ కాకపోవడం వల్ల.. కొన్నేళ్లుగా ఆయనతో డ్యూయెట్లు పాడించడం లేదు మ్యూజిక్ డైరెక్టర్లు. ఐతే.. బాలు వాళ్లబ్బాయి చరణ్ పాడాడా అన్నట్టుగా… వేరియేషన్ చూపించారు బాలసుబ్రహ్మణ్యం. టెక్నిక్ సాయంతో… బాలు వాయిస్ వినసొంపుగా ఉంది. మొత్తానికి వాల్మీకిలో ఈ పాట వస్తున్నంతసేపూ థియేటర్ దద్దరిల్లిపోవడం ఖాయం. రాఘవేంద్రరావు స్టైల్లో బిందెలు, రంగుల బాంబులు.. ఇలా.. పాటంతా కలర్ ఫుల్ గా ఉండబోతోంది.

 

(Visited 124 times, 1 visits today)
Author: kekanews

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *