‘నీ కళ్లు నీలి సముద్రం’ .. ఉప్పెన సినిమాలోని ఈ పాట ఇపుడు ఆన్ లైన్ సెన్సేషన్. ఆడియో పాట అయినా.. వీడియో సాంగ్ అయినా .. రెండూ కూడా దుమ్ములేపుతున్నవే. దేవీశ్రీ ప్రసాద్ అద్భుతమైన ఖవ్వాలీ బాణీకీ మధురమైన గాత్రంతో జావేద్ అలీ ప్రాణం పోశారు. శ్రీమణి, రఖీబ్ ఆలమ్ అందించిన సాహిత్యం ఈ పాటను ఎట్రాక్టివ్ గా మార్చింది.
యూట్యూబ్లో 50 మిలియన్ వ్యూస్ను దాటేసింది నీ కళ్లు నీలి సముద్రం పాట. హీరో సాయిధరమ్ తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్ ఈ మూవీతో హీరోగా పరిచయం అవుతున్నాడు. కొత్త హీరోయిన్ కృతి శెట్టి ఇప్పటికే యూత్ గుండెలు కొల్లగొట్టింది.
ఈ ఇద్దరు ఇచ్చిన ఎక్స్ ప్రెషన్స్.. పాటను హై రేంజ్ కు తీసుకెళ్లాయి. ప్రోమో సాంగ్ ఎడిటింగ్ కూడా మైండ్ బ్లోయింగ్. ధక్ ధక్ ధక్..టైటిల్ సాంగ్ లో ఓ మ్యాజిక్ ను క్రియేట్ చేశాడు డైరెక్టర్ బుచ్చిబాబు. సుకుమార్ రైటింగ్స్ భాగస్వామ్యంతో మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ ఈ మూవీని నిర్మిస్తోంది. సాయిచంద్, బ్రహ్మాజీ కీ రోల్స్ చేస్తున్నారు..