కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ పార్లమెంట్ సభ్యుడు వి.హనుమంతరావుకు కరోనా వ్యాధిబారిన పడ్డారు. ఆయనకు కరోనా వైరస్ సోకింది. VH కు కరోనా నిర్ధారణ కావడంతో.. ఆయన్ను అపోలో హాస్పిటల్ లో చేర్పించారు కుటుంబసభ్యులు. వీహెచ్ తో పాటు ఉన్న అనుచరులు.. అందరూ క్వారంటైన్ కు వెళ్లిపోయారు.
కరోనా వైరస్ టైమ్ లోనూ… ఆయన వీహెచ్ పార్టీ తరఫున ప్రోగ్రామ్స్ లో చురుగ్గా పాల్గొన్నారు. గాంధీ హాస్పిటల్ దగ్గర ధర్నా చేసిన డాక్టర్లకు మద్దతు పలికారు. వారి ధర్నాలో పాల్గొని డిమాండ్లు పరిష్కరించాలని ప్రభుత్వాన్ని కోరారు. ప్రాజెక్టుల దగ్గర దీక్ష నిరసనల్లో పాల్గొని అరెస్టయ్యారు. కరోనా టైమ్ లో గాంధీ హాస్పిటల్ లో నిరసనల్లో పాల్గొనడం వల్ల ఆయనకు వైరస్ సోకి ఉండొచ్చని చెబుతున్నారు.
(Visited 95 times, 1 visits today)