మహేశ్, AA ఫ్యాన్స్ కోసం.. ఇంట్రస్టింగ్ అప్ డేట్

mahesh babu allu arjun
Spread the love

సరిలేరు నీకెవ్వరు… అలవైకుంఠపురములో… ఈ రెండు సినిమాలే ఇపుడు టాలీవుడ్ లో హాట్ టాపిక్. ముందే ప్రకటించిన ఈ రెండు సినిమాల రిలీజ్ డేట్స్.. ఇపుడు అధికారికంగా కన్ ఫామ్ అయ్యాయి. ముందు ప్రకటించినట్టుగానే.. జనవరి 11న మహేశ్ బాబు.. సరిలేరు నీకెవ్వరు థియేటర్లలోకి రానుంది. జనవరి 12న అల్లు అర్జున్ అలవైకుంఠపురములో రిలీజ్ అవుతోంది.

సంక్రాంతి పండక్కి ఇద్దరు టాప్ హీరోల సినిమాలు విడుదల అవుతుండటంతో… టాలీవుడ్ లో ఇంట్రస్టింగ్ ఫైట్ కనిపిస్తోంది. మహేశ్ బాబు సినిమా, అల్లు అర్జున్ గత సినిమాలు మంచి వసూళ్లు సాధించాయి. ఐతే.. మహర్షి హిట్ తర్వాత.. మహేశ్ మూవీ వస్తోంది. ఎఫ్ 2 తో టాప్ డైరెక్టర్ లిస్టులోకి వచ్చేసిన అనిల్ రావిపూడి.. ఓ అగ్రహీరోతో చేస్తున్న యాక్షన్ ఎంటర్ టైనర్ ఇది. దేవిశ్రీ SLNకి మ్యూజిక్ అందించాడు.

నాపేరు సూర్య.. నా ఇల్లు ఇండియా రిలీజైన రెండేళ్ల గ్యాప్ తర్వాత అల్లు అర్జున్ మూవీ వస్తోంది. ఐతే… త్రివిక్రమ్ శ్రీనివాస్- తమన్-పూజాహెగ్డే క్రేజీ కాంబినేషన్ కావడంతో.. మూవీకి మంచి హైప్ ఏర్పడింది.

ఈ రెండు సినిమాలు మొదటిరోజు సాధించే వసూళ్లు.. టోటల్ గ్రాస్.. ఇండస్ట్రీలో ఇప్పటివరకు ఉన్న నాన్ బాహుబలి రికార్డులను బ్రేక్ చేస్తాయన్న అంచనాలు ఉన్నాయి. ఈ రెండు సంక్రాంతి సినిమాలకు U/A సెన్సార్ సర్టిఫికెట్ లభించింది.

జనవరి 5వ తేదీన సరిలేరు నీకెవ్వరు ప్రి రిలీజ్ ఈవెంట్ నిర్వహిస్తున్నారు. చిరంజీవి చీఫ్ గెస్ట్ గా వస్తున్నారు. ఆ తర్వాత రోజుల్లో… అలవైకుంఠపురములో మూవీ రిలీజ్ ఫంక్షన్ ను మరింత గ్రాండ్ గా నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నారు.

(Visited 181 times, 1 visits today)
Author: kekanews

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *