వెటర్నరీ డాక్టర్ ప్రియాంకరెడ్డి హత్యకేసును పోలీసులు ఛేదించారు. నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. సీసీటీవీ పుటేజ్ ఆధారంగా లారీ డ్రైవర్ మహ్మద్ పాషా, చెన్నకేశవులు, జొల్లు శివ, జొల్లు నవీన్ కుమార్ లను అరెస్ట్ చేశారు.
అక్కడ పార్కింగ్ చేయడమే శాపమైంది
కొల్లూరులోని వెటర్నరీ హాస్పిటల్ కు వెళ్లే ప్రియాంకరెడ్డి.. రెగ్యులర్ గా టోల్ ప్లాజా దగ్గర స్కూటీ పార్క్ చేసి బస్సుకు వెళ్తుంటుంది. ఐతే.. గురువారం రాత్రి టోల్ ప్లాజా దగ్గర సిబ్బంది వద్దు అనడంతో… పక్కనే ఉన్న లారీలు ఆపే ఖాళీస్థలంలో స్కూటీ పెట్టి వెళ్లింది. స్కూటీ టైర్ ను నిందితులు ఉద్దేశపూర్వకంగానే పంక్చర్ చేసి డ్రామాలు ఆడారని పోలీసులు గుర్తించారు. కేసులో అన్ని ఆధారాలను సేకరించారు.
ఇలా దారుణానికి ఒడిగట్టారు..
అప్పటికే టైమ్ రాత్రి 9.20 అవుతోంది. వచ్చీ పోయే వాహనాల హోరుకు అరిచినా ఎవరికీ వినపడే పరిస్థితి లేదు. దీంతో.. ఖాళీ స్థలం నుంచి రోడ్డుపైకి వెళ్లే దారిలో… లారీలు అడ్డుపెట్టారు. ఫోన్ మాట్లాడి పెట్టేసిన తర్వాత ఆమెను దుండగులు సమీపించారు. ఏదో అఘాయిత్యానికి ఒడిగట్టపోతున్నారని తెలిసి ఆమె ప్రతిఘటించింది. ఆ తర్వాత ఆమెను పట్టుకుని నోట్లో గుడ్డలు కుక్కి.. దాదాపు ఎకరం విస్తీర్ణంలో ఉన్న పార్కింగ్ స్థలానికి వెనకాల ఉన్న చిన్న రూమ్ వైపు తీసుకెళ్లారు. అక్కడ పెనుగులాట జరిగింది. అక్కడున్న రూమ్ లోకి తీసుకెళ్లేందుకు ట్రై చేశారు. అద్దాలు కూడా పగిలినట్టు తెలిసింది. ఆ రూమ్ బయటే చెన్నకేశవులు అలియాస్ చిన్నా, పాషా, నవీన్, శివ కలిసి అఘాయిత్యానికి పాల్పడినట్టు తెలుస్తోంది.
Read Also : నిందితుల అరెస్ట్.. ప్రియాంక చెప్పిన ఆ దెయ్యపు మొహాలు ఇవే..!
ప్రియాంకరెడ్డికి ఊపిరాడకుండా చేసి దారుణంగా హత్య చేశారు నిందితులు. ప్రియాంకపై నిందితులు గ్యాంగ్ రేప్కు కూడా పాల్పడినట్టు చెబుతున్నారు. తమ నేరం బయటపడుతుందని ఆమెను నిందితులు చంపేశారు. మృతదేహాన్ని దుప్పట్లో చుట్టి… అర్ధరాత్రి అక్కడినుంచి డీసీఎం వ్యాన్ లో తీసుకెళ్లి .. షాద్ నగర్ దగ్గర చటాన్ పల్లి.. అండర్ పాస్ కింద.. కిరోసిన్ పోసి తగలబెట్టారు.
తొండుపల్లి జంక్షన్ దగ్గర ఖాళీ స్థలంలో లారీని అడ్డంపెట్టి అమ్మాయిపై దుండగులు దాడి చేశారు. లారీల వెనకాల ఉన్న నిర్మానుష్య ప్రాంతంలోకి తీసుకెళ్లి అత్యాచారం చేసి హత్య చేశారు. మరో వ్యక్తి స్కూటీ నడుపుతూ వెనకాలే వచ్చాడు. మధ్యలో స్కూటీ ఆపేసి అతడు ఇదే వాహనంలో ఎక్కినట్టు చెబుతున్నారు. అందరూ కలిసి అండర్పాస్ కింద ప్రియాంక మృతదేహాన్ని తగలబెట్టారు.
ప్రియాంక డెడ్ బాడీ 70 శాతం కాలిపోయింది. సజీవ దహనం కాదనీ.. అప్పటికే ఆమె చనిపోయిందని పోస్టుమార్టమ్ రిపోర్టులో తేలింది. నలుగురు కలిసే ఈ దారుణానిక పాల్పడినట్టు పోలీసులు తేల్చారు. ప్రియాంక హత్య కేసులో మహ్మద్ పాషానే మెయిన్ అక్యూజ్డ్ అని పోలీసులు చెప్పారు.