నివేతా పేతురాజ్.. పద్ధతిగా ఉండే పాత్రలైనా… కసక్ బొమ్మలా ఉండే క్యారెక్టర్ అయినా.. దేనికైనా తాను సరిపోతానని అభిమానులతో అనిపించుకునే హీరోయిన్. ఖతర్నాక్ ఫిజిక్ తో.. ఈమె గ్లామర్ ఇప్పటికే ఇండస్ట్రీని ఆకట్టుకుంది. తెలుగులో బ్లాక్ బస్టర్ హిట్ కోసం ఎదురుచూస్తోంది ఈ తమిళమ్మాయి.
అలవైకుంఠపురములో.. అల్లు అర్జున్ తో నటించినప్పటికీ..అందులో అంతగా ప్రాధాన్యతలేని పాత్ర కావడంతో.. నివేతాకు పెద్దగా పేరు రాలేదు. ‘మెంటల్ మదిలో’ సినిమాలో శ్రీవిష్ణు సరసన జతకట్టి టాలీవుడ్ కు మొదట పరిచయమైంది నివేతా పేతురాజ్. అప్పటి నుంచి ప్రేక్షకుల మదిలో ఆమె రూపం మెదులుతూనే ఉంది.
Nivetha Pethurajకు రంగు అంత ఎక్కువ కాకపోతేనేం ఆకట్టుకునే అందాలు.. రూపలావణ్యాలు, కళ్లు ఆమె సొంతం. తమిళనాడులో జన్మించిన ఈ భామ.. తూత్తుకూడిలో చదువుకుంది. తల్లిదండ్రులతో పాటు యూఏఈకి వెళ్లి అక్కడే పదేళ్లు గడిపింది. ఐదేళ్ల కిందట 2015లో.. మిస్ ఇండియా యూఏఈ బ్యూటీ పేజాంట్ లో విన్నర్ గా నిలిచింది. గ్లామర్ కు పట్టం కట్టే సిల్వర్ స్క్రీన్ అయితేనే తనపంట పడుతుందని తెలిసి.. ఇండియాకు వచ్చి..సినిమాల్లో మెరుస్తోంది నివేతా పేతురాజ్. ఓసారి ఆమె లేటెస్ట్ ఫొటోలను చూద్దాం.