టాలీవుడ్ లవర్ బాయ్ నితిన్, షాలిని వెడ్డింగ్ సన్నిహితుల మధ్య సంప్రదాయపద్ధతిలో .. కరోనా లాక్ డౌన్ మార్గదర్శకాల మధ్య నిర్వహించారు. పెళ్లికి హాజరైన అందరూ మాస్కులు పెట్టుకుని వేడుకలో పాల్గొన్నారు. ఆదివారం రాత్రి ముహూర్తానికి షాలిని మెడలో మూడుముళ్లు వేశాడు నితిన్.
ఫలక్ నుమా ప్యాలెస్ లో కళ్లుచెదిరే రీతిలో చేసిన డెకరేషన్ మధ్య నితిన్ పెళ్లి వేడుక జరిగింది. కరోనా కారణంగా.. కుటుంబ సభ్యులు, సన్నిహితులు, కొద్దిమంది వీఐపీలు మాత్రమే పెళ్లికి అటెండయ్యారు.
పెళ్లి తర్వాత.. నితిన్, షాలిని హనీమాన్ ప్లాన్ చేశారు. సినిమాలు కూడా పెద్దగా షూటింగ్స్ లేకపోవడంతో.. పర్సనల్ లైఫ్ ను ఎంజాయ్ చేసే పనిలో ఉన్నారు ఈ కొత్త జంట.
(Visited 404 times, 1 visits today)