ఉపాసన తాత అంత్యక్రియల్లో తేనెటీగల దాడి.. చిరు, చెర్రీ సేఫ్

Upasana Ramcharan
Spread the love

ఉపాసన కొణిదెల తాత ఉమాాపతి రావు అంత్యక్రియలు దోమకొండలో జరిగాయి. ఇటీవల ఆయన చనిపోవడంతో.. ఉపాసన, రామ్ చరణ్ కుటుంబాల్లో విషాదం అలుముకుంది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా దోమకొండలోని ఫామ్ హౌజ్ లో జరిగిన ఉమాపతి రావు అంత్యక్రియల్లో చిన్న అపశృతి చోటుచేసుకుంది.

అంత్యక్రియలు జరుగుతుండగా.. తేనెటీగలు దాడి చేశాయి. ఈ దాడి నుంచి.. చిరంజీవి, రామ్ చరణ్, ఉపాసన ఎలా తప్పించుకున్నారో అని అభిమానులు టెన్షన్ పడ్డారు. ఎవరికైనా గాయాలు అయ్యాయా అని ఆరా తీశారు. హీరోలు, ఉపాసన కుటుంబసభ్యులు, అభిమానులు పీఆర్వోలకు ఫోన్లు చేశారు. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు.

ఐతే.. తేనెటీగల దాడి సంఘటన చాలా చిన్నదే అని చిరంజీవి కుటుంబానికి సన్నిహితులు చెప్పారు. చిరంజీవి, రామ్ చరణ్, ఉపాసన అందరూ సేఫ్ గా ఉన్నారని తెలిపారు.

(Visited 166 times, 1 visits today)
Author: kekanews

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *