మున్సిపల్ ఎన్నికల్లో రాష్ట్ర బీజేపీ ఎంపీలు, నేతలు చేసిన విమర్శలకు ఘాటుగా బదులిచ్చారు సీఎంకేసీఆర్. NRC, NPR, NRCలపైనా మాట్లాడారు. కేసీఆర్ ఏమన్నారో ఆయన మాటల్లోనే.
“ఎర్రి మాటలు.. రీతిలేదు..రివాయి లేదు.. మతకల్లోలాలు చాలాసార్లు వచ్చాయి. మేం కంట్రోల్ చేసినం. భైంసాలో తిక్క కొడుకులు తన్నుకున్నరు. సోషల్ మీడియాల వైరల్ చేశారు. శవాల కాడ పేలాలేరుకున్నట్టు. ప్రభుత్వం అంటే పనిచేయాలి.. పేదరికం పోడగొట్టాలి. హిందూ ముస్లిం అదే పనా. ఇంకే లేదా.. మొన్నటి ఎలక్షన్ల కూడా అదే దందా పెట్టారు. అసదుద్దీన్ గడ్డం కొరికించి నాకు అతికిస్తవా.. ఓ ఎంపీ మాట్లాడే మాటలేనా.. ఇదేనా బీజేపీ సిద్ధాంతం.. ముఖ్యమంత్రి ముక్కు కోస్తరా..
కోద్దామా.. కోసుడే సురువు చేస్తే.. మేం నలుపుతే నశంలకు రారు. మా కేడరే 60లక్షలు.. మాకు పడ్డ ఓట్లు 52 పర్సెంట్. నీకు పడ్డ పర్సెంట్ ఎంత.. నీ బతుకెంత.. నీ కతెంత. ఇదేనా మాట్లాడుడు మాట్లాడితే. గతే ముక్కు కోసుడు మాట్లాడితే..మేం కోసుడు మొదలుపెడితే ఉంటవా నువ్వు. అది పద్ధతేనా. ఈ చిల్లర మాటలెందుకు.
ఆకాశమంత రామ్ మందిర్ కడ్తం అంటే.. జార్ఖండ్ ల ఎల్లెల్కల వడ్డరు. ఉన్న గవర్నమెంట్లే ఊషిపోతున్నయ్ కదా. ఓటెన్క ఓటి వరుసపట్టి పోతున్నయ్. రేపు ఢిల్లీల కూడా కేజ్రీవాల్ వస్తడంటున్నరు. పిచ్చోడిని అడిగినా కేజ్రీవాలే గెలుస్తడంటున్నారు. ఎందుకు ఈ పరిస్థితి తెచ్చుకుంటున్నరు. ఇంత షార్ట్ పీరియడ్ ల. దేశం నిరసిస్తున్నప్పుడు గమనించి..మిడ్ కోర్స్ రివ్యూ చేయాలి. మనం చేసే పనులు నచ్చుతున్నయా.. లేవా.. తప్పుల పడుతున్నమా గమనించుకోవాలి. డెమోక్రసీలో జనం కోసమే పనులు చేయాలి. సీఏఏను 100శాతం మేం వ్యతిరేకిస్తాం. తెలంగాణ కోసం బొంత పురుగును ముద్దిచ్చుకుంట అని చెప్పిన. ఓ కాజ్ కోసం పనిచేసేటప్పుడు కుక్క, నక్క అందరం కలిసిపనిచేస్తాం. ఏమున్నదండ్ల. కొట్లాట, లడాయి జరగాలంటే.. ఒకే అభిప్రాయం ఉన్నోళ్లందరితో కలుస్తాం. కలుస్తరు.”