ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ సాయంత్రం తెలంగాణ భవన్ లో ప్రెస్ మీట్ నిర్వహించారు. కేసీఆర్ మాట్లాడుతున్న టైమ్ లో బయటినుంచి రెండుసార్లు డిస్టర్బెన్స్ జరిగింది. ఢామ్ ఢామ్ అని పేలుళ్ల శబ్దం వినిపించింది. మొదటిసారి కేసీఆర్ పెద్దగా డిస్టర్బ్ కాలేదు. కానీ.. రెండోసారి మాత్రం తన స్పీచ్ ఆపేసి.. సెక్యూరిటీ , ఇతర సిబ్బందికి క్లాస్ పీకారు కేసీఆర్.
ఏందయ్యా.. బయట ఏం జరుగుతంది.. పటాకులు కాలుస్తున్నరా.. లేకపోతే..ఈడ కూడ ఎవడైనా మోపైండా.. తాపతాపకు ఏందిది… అని కేసీఆర్ అన్నారు. కేసీఆర్ అలా నవ్వుతూ అనడంతో.. ప్రెస్ కాన్ఫరెన్స్ హాల్ నవ్వులతో నిండిపోయింది. తర్వాత కేసీఆర్ తన స్పీచ్ కంటిన్యూ చేశారు.
(Visited 63 times, 1 visits today)