బాలీవుడ్ లెజెండరీ యాక్టర్ అమితాబ్ బచ్చన్ ఫ్యామిలీని కరోనా వైరస్ టెన్షన్ పెడుతోంది. ఆ కుటుంబంలో జయాబచ్చన్ మినహా… అందరు కుటుంబసభ్యులకు కరోనా పాజిటివ్ వచ్చింది.
అమితాబ్ బచ్చన్ కు లక్షణాలు కనిపించడంతో.. ఆయన టెస్టులు చేయించుకున్నారు. పరీక్షల్లో పాజిటివ్ అని తేలింది. దీంతో… అమితాబ్ ముంబై నానావతి హాస్పిటల్ లో చేరి చికిత్స తీసుకుంటున్నారు. ఆయనకు ఎటువంటి ఎమర్జెన్సీ వచ్చినా.. వెంటనే చికిత్స అందించేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్టు తెలుస్తోంది. ఐతే.. తనకు కరోనా వచ్చినా ప్రస్తుతానికి ఇబ్బందిలేదని అమితాబ్ ఓ వీడియో విడుదల చేశారు.
అమితాబ్ తో పాటు.. ఆయన కొడుకు అభిషేక్ బచ్చన్ కూడా ఈ ఉదయం పాజిటివ్ నిర్ధారణ అయింది. అభిషేక్ బచ్చన్ భార్య, మాజీ మిస్ వరల్డ్ ఐశ్వర్యారాయ్ కు , వారి కూతురు ఆద్యకు కూడా కరోనా పాజిటివ్ వచ్చింది. అమితాబ్ కుటుంబంలో.. ఆయన భార్య జయాబచ్చన్ కు నెగెటివ్ రిపోర్ట్ వచ్చింది.
కుటుంబంలో అందరూ డాక్టర్ అడ్వైస్ తీసుకుంటున్నారు. కరోనా ప్రాణాంతకం కాదని… ఐతే.. జాగ్రత్తలతో కొవిడ్ ను ఎదుర్కోవచ్చని బచ్చన్ ఫ్యామిలీ చెబుతోంది. ఫ్యాన్స్ ఎటువంటి ఆందోళనకు లోనుకావొద్దని రిక్వెస్ట్ చేశారు.